Home / Inspiring Stories / ‘విశద’ హిందూ కుటుంబాలకు అవసరమైతే ‘గన్స్’ కూడా సరఫరా చేస్తామన్న యోగి ఆదిత్యనాధ్

‘విశద’ హిందూ కుటుంబాలకు అవసరమైతే ‘గన్స్’ కూడా సరఫరా చేస్తామన్న యోగి ఆదిత్యనాధ్

Author:

మహమ్మద్ అఖ్లక్ సంఘటన తో అల్లకల్లోలంగా మారిన ‘విశద’ గ్రామంలోని హిందూ కుటుంబాలకు అవసరమైతే తుపాకులను సరఫరా చేయటానికి బీ జె పి ఏం.పి. యోగి ఆదిత్య నాధ్ సిద్ధంగా ఉన్నారట! ఆ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. ఆ గ్రామంలోని హిందూ కుటుంబాలను అధికారులు వేధిస్తున్నారనే వార్తలు రావటం తో ..హిందూ యువ వాహిని కార్యకర్తలు ‘విశద’ గ్రామంలోకి చొచ్చుకెళ్ళటానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. కిందటి నెల 28 న జరిగిన అఖ్లక్ హత్య ను దురదృష్ట కర ఘటన గా అభివర్ణించిన హిందూ యువ వాహిని నేత జితేంద్ర త్యాగి – ఆ సంఘటనపై సి బి ఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనల సమయంలో అఖ్లక్ లాంటి ముస్లిం కుటుంబాలకు మాత్రమే ఎందుకు నష్ట పరిహారం చెల్లిస్తున్నారు? జయా ప్రకాష్ అనే యువకుడు మరణిస్తే, ఆ యువకుడి కుటుంబానికి ఎందుకు సాయం అందించటం లేదు? అని ఆయన ప్రశించారు. గోవులను చంపిన వారి కుటుంబాల వారికి నష్టపరిహారం చెల్లించటం ఏమిటని ఆయన నిలదీశారు. ‘తాన్-మన్-ధన్-గన్’..ఇందులో ఏది అవసరమైతే దాన్ని,విశద లో ఉన్న హిందూ కుటుంబాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు జితేంద్ర త్యాగి ప్రకటించారు.

(Visited 131 times, 1 visits today)