Home / Political / అధికారమదంతో వందల మంది ముందు వృద్దున్ని కాలితో తన్నిన ఎంపీ

అధికారమదంతో వందల మంది ముందు వృద్దున్ని కాలితో తన్నిన ఎంపీ

Author:

Vitthal Radadiya kicking an old man

ఆయనో ప్రజా ప్రతినిథి.. ఎంతో మంది జనాలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు కానీ డబ్బూ, అధికారం మత్తు లో కనీస మానవత్వాన్నీ మర్చి పోయాడు వయసు కూడా చూడకుండా  ఒక వృద్దుడిని కాలితో తన్నాడు అదీ వందల మంది హాజరైన ఒక సభలో… ఇంతకీ ఎవరా నాయకుడు అంటారా..? బీజేపీ ఎంపీ విఠల్ రడాడియా గతంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న విఠల్ తన రౌడీయిజాన్ని ప్రదర్శించి వార్తల్లోకి ఎక్కాడు. వడోదరలోని టోల్‌గేట్ కార్యాలయంలోకి తుపాకీతో వెళ్లి అక్కడి సిబ్బందిని చావబాదాడు.ఆయనే ఇప్పుడు బీజేపీ లోకి దూకి ఎంపీ కూడా అయ్యారు కానీ, తన స్వభావాన్ని మాత్రం మార్చుకోలేదు…

ఇటీవల పోర్‌బందర్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలమంది జనం పాల్గొన్నారు. ఎంపీ విఠల్ కూడా హాజరయ్యారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఉన్నట్టుండి ఎంపీ కోపంతో ఊగిపోతూ వేదిక మీది నుంచి కిందికి దిగాడు. ఓ వృద్ధుడిపై కండకావరం ప్రదర్శించాడు. జనం ముందు ఓ ముసలాయనను పట్టుకొని కాలుతో విచక్షణా రహితంగా తన్నాడు. కొట్టొద్దంటూ ఆ వృద్ధుడు వేడుకున్నా వినలేదు. వస్తూ వస్తూనే కుడికాలుతో తన్నడం మొదలుపెట్టాడు. వదిలేయండని ఆ వృద్ధుడు ప్రాధేయపడ్డా. బయటకు తోసివేయించే దాకా ఎంపీ గారి ఆగ్రహం చల్లారలేదు.. ఈ తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం తో ఇప్పుడు దేశవ్యాప్తంగా రడాడియా మీద విమర్షలు వెల్లువెత్తుతున్నాయి… ఇతగాడి గత చరిత్రంతా నేరాలమయమే పదుల సంఖ్య లో క్రిమినల్ కేసులు ఈయన గారి మీద ఉన్నాయి….

(Visited 214 times, 1 visits today)