గాయకుల మధ్య జాతీయ స్థాయిలో సోనీ ఛానల్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం ఇండియన్ ఐడల్, వందల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రాలకి చెందిన ఇద్దరు గాయకులు టాప్ 3 కి చేరుకున్నారు, ఎంతో అద్భుతంగా పాడుతూ మన తెలుగు సింగర్స్ రోహిత్ మరియు రేవంత్ లు టాప్ 3 లో నిలిచారు, ఏప్రిల్ 2 న జరిగే ఫైనల్ లో ఇండియన్ ఐడల్ విజేతని ప్రకటించనున్నారు.
ఇండియన్ ఐడల్ విజేతగా నిలవాలంటే జడ్జ్ ల మార్కులతో పాటు సాధారణ ప్రేక్షకుల ఓట్లు కూడా కావాలి, ప్రేక్షకులు ఆన్ లైన్ ద్వారా వేసే ఓట్ల ద్వారానే ఇండియన్ ఐడల్ విజేతని ప్రకటిస్తారు కాబట్టి జాతీయ స్థాయి పోటీలలో ఫైనల్ కి చేరుకున్న మన తెలుగు సింగర్స్ రోహిత్ మరియు రేవంత్ లకి మనం ఓటు వేసి మద్దతు తెలిపితే వారు గెలిచే ఆవకాశం ఉంది, ఇండియన్ ఐడల్ వెబ్ సైట్ కి వెళ్లి ఓటు వెయ్యవచ్చు, సోనీ టీవీ యాప్ ద్వారా కూడా ఓటు వెయ్యవచ్చు, ఓటు ఇద్దరి సింగర్స్ కి కూడా వేయొచ్చు.
indianidol.sonyliv.com అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి ఫేస్ బుక్ లేదా జీమెయిల్ ద్వారా సైన్ ఇన్ అయ్యి ఓటు వెయ్యాలి.