మరో వారం రోజుల్లో వినాయక చవితి మొదలవబోతుంది. ప్రతీ గల్లీలో వినాయకుడు దర్శనమివ్వబోతున్నాడు. దేశం మొత్తం ఆదిపూజ్యుడైన గణపతికి నవరాత్రులు పూజలు చేయటం జరుగుతుంది. ఈ నవరాత్రుల సమయంలో గణనాధుని విగ్రహాలు వేల సంఖ్యల్లో వివిధ ఆకారాల్లో దర్శనమిస్తాయి. వివిధ రకాల దోషాలు, వివిధ పద్ధతిలో తయారు చేయబడిన గణపతిని పూజించటం వల్ల పోగొట్టుకోవచ్చు.
- సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
- చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
- కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
- బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.
- గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
- శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.
- దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
- రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.
- కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.
- అనారోగ్య సమస్యలు తొలగడానికి ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
- అప్పుల బాధలు తొలగిపోవడానికి పగడపు గణపతిని పూజించాలి.
- మానసిక ప్రశాంతత కొరకు పాలరాయితో చేసిన గణపతిని పూజించాలి.
- అన్ని సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.
- సుఖశాంతుల కొరకు స్ఫటిక గణపతిని పూజించాలి.
(Visited 1,675 times, 1 visits today)