Home / Latest Alajadi / జ్వరం అని వెళితే చెయ్యి తీసేసిన ఆసుపత్రి సిబ్బంది…!

జ్వరం అని వెళితే చెయ్యి తీసేసిన ఆసుపత్రి సిబ్బంది…!

Author:

ప్రాణం పోసే డాక్టర్లని దేవుడిలా చూస్తారు మన దగ్గర కానీ ఇప్పుడు ఆ డాక్టర్ లే కాలయముడులా మారి ప్రాణాలు తీస్తున్నారు, పేషెంట్లతో నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, డాక్టర్ , ఆసుపత్రి సిబ్బంది అలసత్వం కారణంగా ఒక అమ్మాయిని జీవచ్చవం లాగా మారిపోయింది, మౌలాలికి చెందిన వైష్ణవి.. అనారోగ్యంతో నాచారంలోని ప్రసాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. డబ్బుల కోసం పదిరకాల టెస్టులు చేసిన సిబ్బంది వైష్ణవి రక్తంలో ప్లేట్ లైట్స్ తగ్గాయని రక్తం ఎక్కించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైష్ణవి కుడి చేతికి ఇన్ ఫెక్షన్ సోకింది, ఆపరేషన్ చేసి దానిని తొలగించారు.ఇన్ ఫెక్షన్ శరీరం మొత్తానికి పాకుతుందని.. రెండు కాళ్లు కూడా తీసేయాలని డాక్టర్లు చెప్పడంతో వైష్ణవి కుటుంబ సభ్యులు జ్వరం అని వస్తే కాళ్ళు చేతులు తీసేయడం ఏంటి అంటూ ఆసుపత్రి సిబ్బంది పై మండిపడి వెంటనే మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు.

జ్వరం అని వెళితే చెయ్యి తీసేశారు

ప్రసాద్ హాస్పిటల్ కి చెందిన వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని , ఆ డాక్టర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని HRC లో వైష్ణవి తల్లిదండ్రలు ఫిర్యాదు చేసారు, డబ్బుల కోసం నిర్లక్ష్యంగా వైద్యం చేసిన ఆ ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకొని ఇలాంటి దుస్థితి  మరెవరికి రాకూడని కన్నీరుమున్నీరవుతున్నారు.

(Visited 3,101 times, 1 visits today)