నల్లధనం పూర్తిగా అరికట్టేందుకు రూ.1000, రూ.500 ల పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ మండలంలోని శనిగపురంలో జరిగింది. శనగపురంలో వినోద అనే వివాహిత తన భర్త నలుగురు కుమార్తెలతో నివసిస్తుంది. వారికి 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఓ కుమార్తె వివాహానికై తనకున్న భూమి మొత్తాన్ని 54 లక్షలకు అమ్మివేసింది. పోయిన సంవత్సరం నుండి మొత్తం డబ్బును ఇంట్లోనే పెట్టుకొని ఉంది. పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకువడంతో తన ఇంట్లో ఉన్న రూ. 54 లక్షలు చెల్లవనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకుందని వినోద భర్త తెలిపాడు. పెద్ద నోట్లను ఏ విధంగా మార్చుకోవాలో తెలియకే వినోద ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు .
పెద్ద నోట్లను ఏవిధంగా మార్చుకోవాలో విస్తృత ప్రచారం జరుగుతున్నా పల్లెల్లో ఉండే వారికి తెలియడం లేదని ఈ సంఘటనతో చాలా స్పష్టంగా తెలుస్తుంది. తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను తీసుకోని బ్యాంక్ లోకి వెళ్తే కొత్త నోట్లు ఇస్తారని కేంద్రం, అధికారులు ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుగకుండా చూడవలసిన భాద్యత ప్రభుత్వ అధికారులపైనే ఉంది అంటున్నారు ప్రజలు.