ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన దేశంలో ఆడవాళ్ళపై అఘాయిత్యాలు ఆగడంలేదు. ఈ రోజు ఢిల్లీలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెల్తున్న కరుణ అనే 21 ఏళ్ల యువతిని ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. కత్తితో 22 సార్లు పొడవడమే కాకుండా తర్వాత ఓ బండ రాయితో ఆ యువతి తలపై మోదాడు. ఈ సంఘటణలో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది.
ఢిల్లీలో టీచర్గా పనిచేస్తున్న కరుణను గత కొంతకాలంగా ఈ హంతకుడు ప్రేమ పేరుతో వేదిస్తున్నాడు. ఈ విషయమై కరుణ తల్లిదండ్రులు ఒకసారి హంతకుడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాని హంతకుడి కుటుంభం వారు వేడుకోవడంతో కేసును వాపసు తీసుకున్నారు. ఇంతలో ఎమైందో కాని హంతకుడు ఈరోజు కరుణపై దాడి చేసి చంపేసాడు. పట్టపగలే, నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటణను జనాలు చూస్తూ నిలబడ్డారే తప్పా ఎవరూ ఆపడానికి ప్రయత్నించలేదు. పోలీసులు హంతకుడిని 34 ఏళ్ల సురేందర్ గా గుర్తించి అతని కోసం వెతుకుతున్నారు.