Home / Entertainment / ‘ఎరుపు’ కథ ‘అత్తారింటికి దారేది’ పైరసీ వ్యవహారమే!?

‘ఎరుపు’ కథ ‘అత్తారింటికి దారేది’ పైరసీ వ్యవహారమే!?

Author:

Yerupu Movie Teaser Released

పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ సినిమా విడుదలకి ముందే పైరసీ బారిన పడి అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ పైరసీ బయటికి ఎలా వచ్చింది, ఆ పైరసీలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారనే నేపధ్యంలో ‘ఎరుపు’ అనే సినిమా తెరకెక్కినట్లు అర్ధమవుతుంది.

తాజాగా ‘ఎరుపు’ చిత్రం యొక్క టీజర్ ని వివిఎస్ లక్ష్మణ్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వెంకట్ కృష్ణ దర్శకుడిగా వెండితెరకి పరిచయం చేస్తు ‘ఓయ్’ సినిమాతో దర్శకుడిగా మారిన ఆనంద్ రంగా నిర్మాతగా మారి ఈ ‘ఎరుపు’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలో సుధీర్, ప్రత్యూష జంటగా నటిస్తున్నరు.

అత్తారింటికి దారేది ఈ పైరసీ వ్యవహారంలో తెర వెనుక ఏం జరిగిందో ఎవరు చేశారు అని ఎవరికి తెలియదు కాని వెంకట్ కృష్ణ తన గురువు ( రామ్ గోపాల్ వర్మ) లా రియాలిటీ స్టొరీలతో, చాలా రియాలిటిగా ఈ సినిమాని చేశాడు అనిపిస్తుంది.. దీంతో ఒక్క టీజర్ తో సినిమాపై భారీ అంచనాలే పెంచేసాడు రాంగోపాల్ వర్మ శిష్యుడు.

(Visited 261 times, 1 visits today)