ఇప్పుడే ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోనే కనపడుతుంది. స్మార్ట్ ఫోన్ వినియోగించే వారందరి ప్రధాన సమస్య ఛార్జింగ్ వెంటనే అయిపోవటం. మనం తరచూ ఫోటోలు మరియు వీడియోలు ఒక ఫోన్ నుండి మరొక ఫోన్ కి చాల విధాలుగా పంపుకోవచ్చు. అదెలా అంటే Bluetooth లేదా Share it లే కాక ఇంకా అనేక యాప్స్ ద్వారా పంపుకోవచ్చు. కాని ఇకపై ఛార్జింగ్ కూడా పంపుకునే వెసులుబాటు రానుంది.
ఫోటో, వీడియో తరహాలో మొబైల్లో ఛార్జింగ్ కూడా మరో మొబైల్ కు పంపుకునే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. “పవర్ షేక్” పేరుతో ఈ వైర్ లెస్ టెక్నాలజీని లండన్ లోని ఓ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. రెండు ఫోన్లలో పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ఉంటే… ఒక ఫోన్ లోని కాయిల్ ద్వారా కరెంటు ప్రవహింపజేసి మరో మొబైల్ కి చేరవేయవచ్చట. 12 సెకన్లు షేర్ చేస్తే నిమిషం మాట్లాడే బ్యాటరీ వస్తుందట.