ఈ మధ్య కాలంలో జనాలంతా షాపింగ్ కి అయ్యే ఖర్చుని ఎక్కువగా కార్డు రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విధంగా కార్డు రూపంలో చెల్లించే విషయంలో ఏ మాత్రం పొరపాటు చేసిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ఆసరాగా చేసుకొని కొందరు హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఉదంతాలు జంట నగరాలలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య అందరూ షాపింగ్ చేసేటప్పుడు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు నోట్లకి బదులు కార్డు ద్వారా చెల్లించేందుకే మొగ్గుచూపుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొన్ని ముఠాలు ఈ ప్లాస్టిక్ కరెన్సీ వినియోగదారుల్ని మోసం చేస్తున్నాయి. ఈ నేరగాళ్ల బారి నుండి అప్రమత్తంగా ఉండాలని పొలీసులు హెచ్చరిస్తున్నారు.
క్రెడిట్/డెబిట్ కార్డు వినియోగదారులు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించండి:
Must Read: ఏటీఎం నుండి నకిలీ నోట్లు వస్తే ఏం చెయ్యాలో తెలుసా..?