ఆడ-మగ అనే భేదం లేకుండా పాదాలు పగిలి ఉండటం మనం తరచూ గమనిస్తూ ఉంటాం. ఇలా పగుళ్ళు రావటం వల్ల మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఇబ్బందికి గురౌతుంటారు. పాదాలకు పగుళ్ళు ఉన్నవారు ఖరీదైన క్రీములు కొని.
అవి మీ చర్మ తత్వానికి పడక ఎలర్జీ రావటం మరియు కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవటం కంటే, మనకు అందుబాటులో ఉన్న ప్రకృతి వరాలని ఉపయోగించటం వలన ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతం చేసుకోవచ్చు. ఎలా ట్రై చేసి చూడండి మీరే మంచి ఫలితం పొందుతారు.
పాదాలు పగుళ్లతో బాధ పడేవారు వేపాకు ద్వారా ఉపశమనం పొందవచ్చు. వేపాకుని మిక్సీలో వేసి పేస్టులా చేసి దానికి పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పగిలిన పాదాలకి రాయాలి. కొద్ది సమయం తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి కొబ్బరి నూనె రాయాలి. ఇలా చేయటం వల్ల పాదాలు మృదువుగా అవటంతో పాటుగా పగుళ్ళు కనుమరుగు అవుతాయి.
Must Read: జింజర్ వాటర్ తాగి సులభంగా బరువు తగ్గించేసుకోవచ్చు.