కొన్నిసార్లు శరీరం మొత్తం ఉబ్బిపోయినట్టు,బాగా వాపు వచ్చినట్టుగా కొంత మందిలో అప్పుడుడప్పుడు కనిపిస్తుంది, అయితే అలా శరీరం ఉబ్బిపోవడానికి కారణం మన శరీరంలో నీరు ఎక్కువ అవడం, మన శరీరంలో నీరు ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ మొత్తంలో ఉంటే శరీరం ఉబ్బిపోతుంది అని వైద్య నిపుణులు తెలిపారు, ఇలా ఉబ్బిపోయిన శరీరాన్ని తగ్గించుకోవడానికి ఎటువంటి మందులు వాడటం, చికిత్స లు చేయించుకోవడం చేయాల్సిన అవసరం లేదు, సహజంగానే తగ్గించుకోవచ్చు, కింద ఇచ్చిన టిప్స్ ని పాటిస్తే శరీరంలో ఎక్కువ మోతాదులో ఉన్న నీటిని చాలా సులభంగా బయటికి పంపించవచ్చు.
- ఉప్పు ఎక్కువగా తింటే అందులో ఉన్న సోడియం శరీరంలో ఎక్కువ నీరు నిల్వ ఉండేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే చాలు. శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది.
- శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటికి పంపించడంలో విటమిన్ B6 బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విటమిన్ ఎక్కువగా ఉన్న పిస్తా పప్పు, చేపలు, అరటి పండ్లు, డ్రై ఫ్రూట్స్, పాలకూర వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే నీరు అంతా బయటికి పోతుంది.
- పొటాషియం కూడా అధిక నీటిని శరీరం నుంచి పంపించడంలో మెరుగ్గానే పనిచేస్తుంది. అరటి పండ్లు, అవకాడోలు, బీన్స్, పాలకూర వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది.
- నట్స్, ఆకుపచ్చని కూరగాయల వంటి మెగ్నిషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నా ఒంట్లో ఉన్న నీరు బయటికి పోతుంది. ప్రధానంగా వీటిని మహిళలు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.
- నీటిని ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా ఒక్కోసారి శరీరం ఉబ్బిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని కూడా తగిన మోతాదులో నిత్యం తాగాల్సిందే.
- చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. లేదంటే అవి మన శరీరంలో నీటిని అధికంగా నిల్వ చేస్తాయి.
- వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో నిల్వ అయ్యే అధిక నీటి సమస్య నుంచి బయట పడవచ్చు.
- జీలకర్రను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నా అధిక నీరు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతుంది.
- సింహదంతి (Dandelion) అని పిలవబడే మొక్క ఆకులను తింటున్నా ఒంట్లో అధిక నీటి సమస్య నుంచి బయట పడవచ్చు.
(Visited 8,005 times, 1 visits today)