వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకి చేరుకుంది, ఒక కాలుకి చేయాల్సిన ఆపరేషన్ ని మరొక కాలుకి చేశారు ఢిల్లీ వైద్యులు, రవి అనే 24 ఏళ్ల యువకుడు మెట్ల మీద నుండి జారి పడటం వల్ల అతని కుడి కాలు ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేయించుకుందామని దగ్గరలోని ఫోర్టిస్ హాస్పిటల్కు వెళ్లారు, ఆ వెంటనే సర్జరీకి అవసరమైన టెస్ట్ లు అన్ని ఫ్రాక్చర్ అయిన కాలుకి చేసి, ఆపరేషన్ మొదలుపెట్టారు.
గంటపాటు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆపరేషన్ సక్సెస్ అయిందని కుటుంబ సభ్యులకి తెలిపారు,ఆ తరువాత ఆపరేషన్ థియేటర్ నుండి పేషెంట్ ని బయటకు తీసుకవచ్చారు, అప్పుడు రవిని చూసిన కుటుంబసభ్యులకి దిమ్మ తిరిగిపోయింది,రవికి కుడికాలు విరిగితే ఎడమ కాలుకి ఆపరేషన్ చేసిన కట్లు ఉండడాన్ని చూసి విస్మయం చెందారు, కుడి కాలుకే అన్ని టెస్ట్ లు చేసి, మార్కింగ్ లు కూడా పెట్టుకొని ఎడమ కాలుకి ఎలా ఆపరేషన్ చేశారన్న రవి కుటుంబ సభ్యుల ప్రశ్నకి వైద్యులు పొంతన లేని సమాధానాలు చెప్పారు, ఏ కాలుకి చేస్తే ఏంటి..? నష్టమేమి లేదు, ఇప్పుడు మరోసారి ఆపరేషన్ చేసి ఎడమకాలులోని స్క్రూలు తీసి కుడికాలులో వేస్తామని అని వైద్యులు నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడంతో రవి కుటుంబ సభ్యులు ఆందోళన చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, మీడియా రంగంలోకి దిగడంతో హాస్పిటల్ యాజమాన్యం ఆపరేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకొని, రవిని మెరుగైన వైద్యం కోసం మరొక హాస్పిటల్ కి తరలించింది.
ఊర్లలో ఉండే ఆర్.ఎం.పి డాక్టర్లు కూడా ఇంత నిర్లక్ష్యంగా వైద్యం చేయరు, దేశ రాజధానిలో ఒక పెద్ద హాస్పిటల్ ని పెట్టుకొని ఒక కాలుకి బదులు మరొక కాలుకి ఆపరేషన్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు, నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలతో ఆడుకొనే ఇలాంటి డాక్టర్స్ ని కఠినంగా శిక్షించాలి, మీరు కూడా ఇక మీదట హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇక అంతే సంగతులు.
Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!