Home / Entertainment / లీకైన చిరంజీవి ‘కత్తిలాంటోడు’ డైలాగ్ ఇదే…!

లీకైన చిరంజీవి ‘కత్తిలాంటోడు’ డైలాగ్ ఇదే…!

Author:

ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అందరి కళ్ళు మెగాస్టార్ చిరంజీవి పైనే ఉన్నాయి. తన 150వ సినిమా కోసం అందరూ వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. వీ వీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘కత్తి’ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ చంచల్ గూడ జైలులో జరుగుతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తమ సొంత బ్యానర్ అయిన ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ పై నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలో ఉండే డైలాగ్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Chiranjeevi-As-Khaidi-number-150

‘రైతులకి దుక్కి దున్నడమే తెలుసు. దుర్మార్గం చేయటం తెలియదు. నాగలి పట్టడమే తెలుసు. నరకటం తెలియదు. మీరు వీళ్ళ పొలాలకి నీళ్లు ఇవ్వకపోతే.. ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కల్ని నరుకుతూ మీ గుండెల్ని దున్నుకు పోతారు’. అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. మరీ, డైలాగ్ సినిమాలో ఉందో, పుకారో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే….

Must Read: టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో చేయని సాహసం చేయబోతున్న రామ్

(Visited 4,806 times, 1 visits today)