సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కొంతమంది, సోషల్ మీడియా పిచ్చిలో సరదా కోసం ఎలాంటి పనులు చేస్తున్నామో, అవి ఎలాంటి ఫలితాలని ఇస్తాయో అని ఏమాత్రం ఆలోచించకుండా పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రమాదాలను కొని తెచ్చుకొని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో జరిగింది.
హైదరాబాద్ లోని భరత్ నగర్ కి చెందిన శివ అనే యువకుడు.. భరత్ నగర్ లో ఉన్న రైల్వే ట్రాక్ పై వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కి ఎదురుగా నిలబడి సరదా కోసం చేసిన పని శివ ప్రాణాల మీదకి తెచ్చింది, ఫ్రెండ్స్ వద్దని చెబుతున్నప్పటికీ సెల్ఫీ మోజులో ట్రైన్ కి ఎదురుగా నిలబడి వీడియో తీసుకునే ప్రయత్నంలో వేగంగా దూసుకువచ్చిన ఎంఎంటీఎస్ ట్రైన్ శివని బలంగా ఢీకొట్టింది, ఈ క్రమంలో ఆ యువకుడి తలకు చేతికి బలంగా గాయాలయ్యాయి.! ప్రస్తుతం లింగంపల్లి హాస్పిటల్ లో శివ చికిత్స పొందుతున్నాడు.! ఆ సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.