ప్రతి భారతీయునికి భారతదేశంపై చాల ప్రేమ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు బయటి దేశాలలో ఉన్న చివరికి భారతదేశానికి రావడానికే ఇష్ఠపడతారు. వేరె దేశంలొ నివసిస్తున్న, బయటి దేశాలలో ఎన్ని డబ్బులు సంపాదించినా తిరిగి మన దేశంలో ఇల్ల స్తలాలు కొనడమొ లేదా ఇంక ఏదైనా బిజినెస్ లొ పెట్టుబడి పెట్టడమో చేస్తుంటారు ప్రవాస భారతీయులు.
ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కలు కూడా ఇదే నిజమని నిరూపిస్తున్నాయి. 2014-15 సంవత్సారానికి గాను ప్రవాస భారతీయులు అందరు కలిసి 3 లక్షల కోట్ల రూపాయలను బయటి దేశాల నుండి భారతదేశానికి పంపించారంట. అందులొ చాలా మంది భారతదేశంలొ ఉన్న తమ తల్లితండ్రుల ఇంటి ఖర్చుల నిమిత్తం ఆ డబ్బు పంపుతున్నం అని తెలిపారట. కాని అందులో చాల డబ్బు భూములు కొనడానికి, బిజినెస్ అవసరాల కోసం అని మనకి తెలుసు.
ఇక బయటి నుండి వచ్చిన డబ్బులలొ 37% డబ్బులు గల్ఫ్ దేశాల నుండి వస్తుంది, ఆ తర్వాత 34% డబ్బులు అమెరికా నుండి, 12% యూరప్ దేశాల నుండి మరియు మిగాతాది మిగిలిన దేశాల నుండి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనిని బట్టి భారతీయులు ఏ దేశంలొ ఉన్న తమ సొంత దేశంపై మమకారం కోల్పొరని అర్దం అవుతుంది. దీనిపై మరింత సమాచారం కొరకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి.
Must Read: ట్రయల్ రూమ్ లో ఉండే సీక్రెట్ కెమెరాలను కనిపెట్టే విధానం తెలుసుకోండి.