Home / Inspiring Stories / నవంబర్ నెలలో 15 రోజులు పూర్తిగా చీకటిమాయం కానుంది.

నవంబర్ నెలలో 15 రోజులు పూర్తిగా చీకటిమాయం కానుంది.

Author:

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేరుమీద వచ్చిన వార్తా ఇప్పుడు అందరిని కలవరానికి గురిచేస్తుంది, అన్ని దేశాల ప్రజలు దీని గురుంచే విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు, ఆ వార్త ఏమిటంటే నవంబర్ లో 15 రోజులు పూర్తిగా చీకటిమాయం కాబోతుందట, నవంబర్ 15 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు భూమి మొత్తం చిమ్మచీకటి కానుందట.నాసా సంస్థ ఈ విషయం గురుంచి అమెరికా అధ్యక్షుడికి ముందుగానే నివేదిక సమర్పించినట్టుగా ఈ కథనంలో పేర్కొంది.

nasa-about-november-black-out1

అంతర్జాతీయ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం నవంబర్ బ్లాక్ అవుట్ గా పిలిచే ఇది.. నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4.15 వరకు ఉంటుందని చెబుతున్నారు. 10 లక్షల సంవత్సరాలకి ఒక్కసారి ఇలా జరుగుతుందని సైంటిస్టులు తెలుపుతున్నారు.శుక్రగ్రహం, గురు గ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాలతోనే ఇలా భూమి చీకటిమయం అవుతుందని, అంతేకాదు నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 2 గంటల 58 నిమిషాల నుంచి సూర్యుని వెలుతురు కూడా తగ్గుతుందట. బ్లాక్ అవుట్ ఎఫెక్ట్ భూమిపై చూపించనుంది. దీంతో 8 నుంచి 9 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కథనంలో పేర్కొంది.

కాకపోతే ఈ వార్తల పై నాసా సంస్థ ఎటువంటి అధికారక ప్రకటన విడుదల చేయలేదు, ఇతర అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా ఏం తెలుపలేదు, ఇంతకుముందు 2012 లో యుగాంతం అని చాలా హడావుడి చేసారు ఏం జరగలేదు, ఇంకొన్ని సార్లు భూమిని ఢీ కొట్టడానికి అంతరిక్షం నుండి ఉల్కలు వస్తున్నాయి అని ప్రచారం చేసారు అప్పుడు కూడా ఏమి జరుగలేదు, ఇప్పుడు కూడా ఈ నవంబర్ బ్లాక్ అవుట్ అనేది ఉత్తుత్తి ప్రచారమే అని కొంతమంద శాస్త్రవేత్తలు మాట్లాడుకుంటున్నారు, ప్రజలు కూడా ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఈ విషయాన్నీ లైట్ తీసుకుంటున్నారు, ఎక్కువమంది ఇదంతా తప్పుడు సమాచారం అని భావిస్తున్నారు, ఇటువంటి తప్పుడు వార్తలని ప్రజలు నమ్మకముందే నాసా సంస్థ అధికారకంగా ఏదైనా ప్రకటన విడుదల చేస్తే ఈ వార్తలన్నీ ఆగిపోతాయి.

Must Read:  జియోకి షాక్: బీఎస్‌ఎన్‌ఎల్ నుండి 2 రూపాయలకే అన్ని కాల్స్ ఫ్రీ.

(Visited 9,819 times, 1 visits today)