తీరికలేని పని ఒత్తిడితో సతమతమయ్యేవారిలో కొందరు ఉన్నట్లుండి భరించలేని కడుపు మంటతో బాధ పడిపోతుంటారు. కడుపులో మొదలైన ఈ మంట క్రమంగా గొంతులోకి తన్నుకు వస్తున్నట్లు బాధ కలుగుతుంది. పైకి మామూలుగానే కనిపించినా కడుపులో తట్టుకోలేని మంట… అగ్నిపర్వతాలు రగులుతున్నాయా? అన్నంత బాధ… కంటి నిండా నిద్ర పట్టదు.. స్థిమితంగా కూర్చోనివ్వదు.. ఇదంతా యాసిడిటి మహిమ.
సాధారణముగా మసాల ఉన్న పదార్దాలు తిన్నప్పుడు, ఎక్కువ కారం ఉన్న పదార్దాలు తిన్నప్పుడు కడుపులో మంట వస్తుంది. మసాల పదార్ధాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేకుంటే కడుపులో అల్సర్ వ్యాధి వస్తుంది,ఇదే కాలక్రమములో కేన్సర్ గా మారుతుంది. కడుపులో వచ్చే మంట గ్యాస్ గా మారి అది గుండెల్లొ నొప్పిగా కూడ మారుతుంది. ఈరోజుల్లో రుచికరమైన ఆహారం కావలంటే మసాలాలు ఉండక తప్పట్లేదు,కనుక మసాల ఉన్న ఆహారం తినేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వాటినుంచి ఉపశమనం పొందవచ్చు.
పైన మేము తెలిపిన చిట్కాల వలన తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. అప్పటికీ, మార్పు రాకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం శ్రేయస్కరం.
Must Share: రేషన్ కార్డు పోయిందా..? ఇప్పుడు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.