మొబైల్ ఉన్న వాళ్లలో ఎక్కువ మంది వాడుతున్న అప్లికేషన్లలో వాట్సాప్ మెసేంజర్ ముందు ఉంటుంది, కొత్త కొత్త ఫీచర్లతో జనాన్ని కట్టిపడేస్తోంది, వాట్సాప్ యాప్ ఫోన్ లో ఉంటే చాలు ఫ్రీగా మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు పంపుకోవచ్చు, కొన్ని రోజుల కింద వాట్సాప్ లో ఉచితంగా ఫోన్ మాట్లాడే సౌకర్యాన్ని కూడా కల్పించారు, కానీ ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ బ్యాలన్స్ ని వేయించుకోవాలి, ఈ మధ్య ఇంటర్నెట్ రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి, కానీ వాట్సాప్ యూజర్లు ఎగిరి గంతేసే వార్త ఒకటి వచ్చింది, అదేంటంటే..!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వాట్సాప్ మెసెంజర్ను వాడేసుకోవచ్చు, దీని కోసం మనం ఒక ప్రత్యేకమైన సిమ్ కి కొనాల్సి ఉంటుంది, చాట్ సిమ్ పేరుతో వాట్సాప్ కోసమే ఒక సిమ్ ని తయారుచేశారు, ఈ చాట్ సిమ్ ని మొబైల్ లో వేసుకొని ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ ని వాడుకోవచ్చు, ప్రస్తుతానికి ఈ చాట్ సిమ్ కేవలం యూరప్ దేశాలలోనే అందుబాటులో ఉంది, త్వరలోనే మనదేశంలోనూ అందుబాటులోకి వస్తాయని చాట్ సిమ్ వారు తెలిపారు.
Must Read: Video: ఫోన్ నీళ్లలో పడిందా..? అయితే ఇలా చేయండి..!