పాకిస్తాన్కి భారత దేశానికి మధ్య ఉన్న గొడవలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలా తెలిసి కూడా ఓ ప్రభుద్దుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో గల వాఘా సరిహద్దు గేటును తన స్కార్పియో వాహనంతో బద్దలు కొట్టాడు.కెనడాకు చెందిన యన్ఆర్ఐ పాకిస్తాన్లోకి ప్రవేశించే వాఘా సరిహద్దులో గల గేట్లను నిన్నిటి ఉదయం తన స్కార్పియో వాహనంతో బద్దలు కొట్టాడు.
దీని గురించి బియస్యఫ్ సీనియర్ అధికారి కథనం ప్రకారం స్కార్పియో డ్రైవర్ మాట్లాడుతూ తను పాకిస్తాన్లో ఉన్న నకాన్ సాహిబ్ అనే వ్యక్తికి ధన్యవాదాలు తెలపడానికి వెళుతుండగా ఇలా జరిగిందని తెలిపాడు. అతని కథనం ప్రకారం తాను వీసా పొందడానికి చాలా సమయం పడుతుందని అందుకోసం తాను ఇలా రోడ్డు ద్వారా వెలుతున్నానని తెలిపాడు. అయితే పాకిస్తాన్ వార్తా పత్రిక అతను ఖచ్చితంగా పాకిస్తాన్ సరిహద్దులో గల వాఘా గేట్లను ఒక పథకం ప్రకారం ద్వసం చేశాడు అని ప్రచురించింది.
అయితే ఈ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు బార్డర్ సెక్యురిటి ఫోర్స్ అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఆ వాహనం ఎక్కడిది? అతను నిజంగా ఎక్కడికి వెలుతున్నాడు అనే విశయాల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్కు చెందిన అధికారులు అతనిని వారికి అప్పగించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ వార్తా పత్రికలు అతను తాగిన మత్తులో ఇలా చేశాడని ప్రచురించాయి. అయితే మన అధికారులు అది వాస్తవం కాదని ఆ వార్తలను కొట్టి పారేశారు.
Must Read:Ola cabs కాదు Ola boats.