Home / Inspiring Stories / 1947 నాటి కొన్ని సంఘటనల అరుదైన వీడియో.

1947 నాటి కొన్ని సంఘటనల అరుదైన వీడియో.

Author:

రెండు వందల సంవత్సరాల భానిసత్వం నుంచి ఒక జాతి బయట పడింది.తమ పై తెల్లవాడి పెత్తందారీ తనాన్ని ఒప్పుకోని భారత పౌరుల తిరుగుబాటు ఫలించింది. వందల సంవత్సరాల సంకెళ్ళు తెగి స్వేచ్చగా భారత మాత ఊపిరి పీల్చుకుంది. చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఈ దేశాన్ని విడిచి పెడుతున్నాం అంటూ అధికారిక ప్రకటన్ చేసాడు. ఊరూరా ప్రతీ మనిషీ ఆనందంతో ఉప్పొంగి ఊగిపోయాడు. తెగిన బానిసత్వ గొలుసలని కాలికింద వేసి ఆనందంతో చిందులు వేసాడు., భారత జాతీయ పతాకం ప్రతీ నాలుగురు మనుషులు ఉన్న చోటల్లా రెపరెపలాడింది…..

ఐతే దీనికి రెండో వైపున అంతులేని విషాదమూ ఉంది అఖండ భారతావని ముక్కలు చేయబడింది పాకిస్థాన్ భారత్ లు లుగా ఒకే శరీరం రెండు వేరు వేరు భాగాలుగా తెగ కోయబడింది.ఆగస్ట్ 14న పాకిస్థాన్ లోనూ,15 న భారత దేశంలోనూ స్వతంత్ర దిన వేడుకలు జరుగుతోంటే.. ఘాందీజీ కలకత్తాలో ఒక మురికి వాడని శుభ్రం చేస్తూ గడిపారు.దేశ విభజన తర్వాత రెండు సరికొత్త దేశాల ఏర్పాటు జరిగిన వెంటనే కొన్ని నెలలోనే రెండు దేశాల మధ్య విపరీతంగా జనాభా మార్పిడులు చోటు చేసుకున్నయ్ సరిహద్దులు నిర్ణయించిన వెంటనే 14.5 మిలియన్ల జనాభా వారు ఆశించిన ఆధిక్యత మత బంధు రక్షణ పరంగా హద్దులు దాటారు. 1951 జనాభా లెక్కల ప్రకారం నిర్వాసిత ప్రజల్లో, 7,22,000 ముస్లిములు భారత దేశం నుండి పాకిస్తాన్ కు వెళ్ళగా, 7,249,000 మంది హిందువులు మరియు సిక్కులు కలసి విభజన తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశానికి చేరుకున్నారు. లక్షల్లో సంఖ్యలో హిందూ,ముస్లిం ల పేరుతో మనుషులు చంపబడ్డారు. ఆనాటి కొన్ని సంఘటనల ఈ వీడియో ఒక సారి చూడండి.

Must Read: పవర్ స్టార్ ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ గా ఎన్టీఆర్.

(Visited 5,777 times, 1 visits today)