Home / Inspiring Stories / రండి బాబూ రండీ…! రూ.251 కే మేకిన్ ఇండియా స్మార్ట్ ఫోన్.

రండి బాబూ రండీ…! రూ.251 కే మేకిన్ ఇండియా స్మార్ట్ ఫోన్.

Author:

స్మార్ట్ ఫోన్ ఈ కాలపు కనీస అవసరం, ప్రతీ మనిషి జీవితం లోనూ ఒక భాగం ఐపోయింది. బిజీ జీవితాల్లో ఇంటర్నెట్ కూడా ఒక భాగమై పోయాక ఇక స్మార్ట్ జీవితాల కోసం స్మార్ట్ ఫోన్ తప్పని సరి అయింది. అయితే మామూలు మనుషులకు ఎంత తక్కువ ధర అయినా టచ్ స్క్రీన్ మొబైల్ కాస్త ఖరీదయిన వ్యవహరమే.., కానీ ఇప్పుడు అ సమస్య కూడా తీరిపోనుంది.మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డొమెస్టిక్ హ్యాండ్ సెట్ మేకర్ రింగింగ్ బెల్స్ రూ.500లకే స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆశ్చర్యం నుంచి జనం ఇంకా తేరుకోకముందే,ఈ ఫోన్ విడుదలైన మరుసటి రోజే ఫ్రీడమ్ 251 పేరుతో అబ్బురపరిచే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం 251 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ అంటే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు చెప్పండి . అంతేకాదు,250 రూపాయలకు మామూలు ఫోనే రావటం లేదు ఇక స్మార్ట్ ఫోన్ అంటే ఏదో “నాం కే వాస్తే” టచ్ స్క్రీన్ అనుకుంటారేమో ఈ ఫోన్ ఫీచర్లు తెలిస్తే మీరు ఆశ్చర్యపోయి తేరుకోకుండానే మళ్ళీ ఆశ్చర్య పోతారు…

Freedom 251 booking

4 అంగుళాల స్క్రీన్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మొమొరీ, 32జీబీ వరకూ పెంచుకునే సామర్థ్యం, 1.3 క్వార్డ్‌కోర్ ప్రాసెసర్, 3.2 పిక్సెల్ బ్యాక్ కెమెరా, 0.3 పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1450 mah బ్యాటరీ. ఇలాంటి అద్భుత ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందింది. ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిచంనున్నారు. కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 18 నుంచి బుకింగ్స్ ప్రారంభింనున్నారు. 21 తేదీ రాత్రి 8 గంటలకు బుకింగ్స్ క్లోజ్ చేయనున్నారు. జూన్ 30వ తేదీ నాటికి డెలివరీ పూర్తవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఈ ఫోన్ బుక్ చేయాలనుకుంటే Freedom251.Com కి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి.బుకింగ్స్ గురువారం(Feb-18th) ఉదయం 6 గంటల నుండి మెదలవుతాయి.

 Must Read:సౌత్ ఏసియన్ గేమ్స్ లో సంచలనం సృష్టించిన భారత్.

(Visited 11,811 times, 1 visits today)