తెలంగాణ భోజన ప్రియులకి శుభ వార్త, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా రాష్ట్ర ప్రజలు చేసుకునే అన్ని రకాల వంటలు ఒకేచోట ప్రదర్శించబోతున్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జూన్ 1 నుండి 5వ తేది వరకు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో 25హోటళ్ళ స్టాళ్ళను ఏర్పాటు చేయనున్నారు.ఈ స్టాళ్ళలో సాకినాలు, గారెలు, సంగటి, బిర్యాని, హలీమ్ తదితర వంటకాలు కొలువుదీరనున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజ్ ఫలక్ నూమ, తాజ్ కృష్ణ, తాజ్ బంజారా, తాజ్ దక్కన్, లెమన్ ట్రీ, మ్యారియెట్, పార్క్ హయత్ వంటి ప్రముఖ హోటళ్ళ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ వంటకాలను అమితంగా ఇష్టపడే వారు వేల సంఖ్యలో ఈ ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొననున్నారు.
Must Read: Video: రేషన్ కార్డు పోయిందా..? ఇప్పుడు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.