వ్యక్తిగత స్వేచ్చ ఎంత ఉన్నా కొన్ని దేశాల చట్టాలు అన్నిటినీ తేలిగ్గ తీసుకోవు. ఆటగాడి పై అభిమానం వేరూ దేశం మీద చూపే గౌరవం వేరు. సరిగ్గా ఒక క్రికెట్ అభిమాని విషయంలో ఇదే జరిగింది. భారత ఆటగాడైన విరాట్ కోహ్లీ మీద ఉన్న వీరాభిమానమే అతనికి కష్టాల్ని తెచ్చింది. దీనికి కారణం అతను పాక్ దేశస్తుడు కావటమే.పాక్ చట్టాల ప్రకారం వేరే దేశాల ఝంఢాలను తమ ఇళ్ళమీద గానీ,కార్యాలయాల మీద గానీ,ప్రధాన కూడళ్ళలో గానీ ఎగురవేయటం, ప్రదర్శించడం నేరం కిందకి వస్తుంది. ఐతే ఈ విషయం తెలియని లాహోర్కు సమీపంలోని ఓకారా కు చెందిన ఉమర్ అనే వ్యక్తి కోహ్లిపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ తన ఇంటిపై భారత దేశ చిహ్నం అయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. వేరే దేశపు ఝండా అందులోనూ పాక్ శతృవుగా భావించే భారత పతాకం కావటంతో. పాక్ పోలీసులకూ,కోర్టులకూ ఆ అమాయక క్రీడాభిమానిలో దేశ ద్రోహి కనిపించాడు.
అంతే అతని మీద పాకిస్థాన్ శిక్షా స్మృతిలోని దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే నిబంధనల ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలు రుజువై అతడికి గురువారం నాడు పదేళ్ల వరకూ జైలు శిక్ష పడింది. కోహ్లిపై అభిమానాన్ని చాటిచెప్పేందుకు మాత్రమే భారత పతాకాన్ని ఎగురవేశానని,తన దేశ చట్టాలలో ఇది నేరమని తనకు తెలియదని,తనకు ఒక ఆటగాడిగా నచ్చిన విరాట్ అంటే ఉన్న అభిమానం తోనే ఇంట్లో అతని పోస్టర్లను అతికించుకున్నాననీ కేవలం అతని మీద ఇష్టంతోనే అలా పతాకాన్ని తన ఇంటిపై పెట్టానని ఉమర్ ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా. అతనికి పదేళ్ళ కారాగార శిక్ష విధించింది. పాక్ కోర్టు.
Must Read: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.